కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కార్యకర్తలు కృషి చేయాలి. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్చార్

Published: Friday December 23, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ ఇన్చార్జ్ విలాస్ రావు అన్నారు.
 
 యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ముడిమడుగుల మహేందర్ అధ్యక్షతన జరిగిన "యూత్ జోడో" "బూత్ జోడో" శిక్షణా కార్యక్రమాన్ని, రాష్ట్ర యూత్ అధ్యక్షులు శివసేనారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ప్రారంభించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు,
ఒక్కోబూతుకు ఐదుగురు యువకులను ఎన్రోలర్స్ ను ప్రోత్సహించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలన్నారు.
 ఈ కార్యక్రమంలో  
 యువజన కాంగ్రెస్ నాయకులు పోచంపల్లి హరీష్ , ఉపాధ్యక్షులు  అచ్ఛ శివాజీ , ప్రధాన కార్యదర్శి ఎలుక ఆకాష్, శ్రావణ్ బోగ్గ, కాసిపేట మండల రాకేష్, సాయి , సమంత,ప్రదీప్,  శశి,వేమనపల్లి కిరణ్ ,  గట్టేష్, నాగేంద్రబాబు ,వెంకట్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.