బెల్లంపల్లి పట్టణ ఏ ఐ ఎస్ ఎఫ్ కమిటీ ఎన్నిక

Published: Monday August 08, 2022
బెల్లం పల్లి ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ ఏఐఎస్ఎఫ్ కన్వీనింగు  కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన 
 బెల్లంపల్లి పట్టణ బాలుర ఎస్సీ వసతి గృహంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు,
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు.
 జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలు చాలా అద్వానంగా ఉన్నాయనీ, ఎన్నిసార్లు జిల్లా అధికారులకు మౌలిక వసతులు కల్పించాలని, చెప్పినా,  ఫిర్యాదులు చేసినప్పటికీ, కూడా పట్టించుకోవడం లేదని అన్నారు, 
 సంక్షేమ హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే విద్యార్థుల అందరితో కలిసి చలో కలెక్టరేట్ కు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని, ఆయన అధికారులను హెచ్చరించారు.  
 దేశంలోనే విద్యార్థి సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని, అలాంటి సంగం ఆగస్ట్ 12 న నిర్వహించే  వార్షికోత్సవాలని  జిల్లా వ్యాప్తంగా, ఘనంగా నిర్వహించాలని విద్యార్థిలోకానికి ఆయన పిలుపునిచ్చారు.
  పట్టణ కన్వీనింగ్ కమిటీలో  బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా మధుకర్, కో కన్వీనర్ గా సాయి, కమిటీ సభ్యులుగా భక్తు మహేష్ , అల్లూరి ప్రసాద్, నవీన్, లని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.