ఎమ్మెన్నార్ ఐ పి ఎల్ 2 ప్రారంభించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్

Published: Monday March 28, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా అధిబాట్ల మున్సిపల్ బొంగుళూర్ వద్ద మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెన్నార్ ఐపీఎల్  2 క్రికెట్ టోర్నీమెంట్ ను ప్రారంభించిన స్థానిక పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీటీసీలు మర్రి నిత్యనిరంజన్ రెడ్డి, మహిపాల్, అధిబాట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్,హాజరైన 250 టీమ్ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ ప్రధాన మంత్రి, సంబంధిత మంత్రులతో చర్చలు జరిపినం, ఫార్మా కంపెనీలలో రైతులకు జరుగుతున్న అన్యాయం  ఫార్మా రైతులకు 12లక్షలు, ఇచ్చి ఎకరానికి కోటి రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నారని, రైతులకు న్యాయం చేయాలని ప్రధాన మంత్రి వినతి పత్రాలు ఇచ్చామని,  సానుకూలంగా స్పందించిన పాటికి, పూర్తి స్థాయిలో ఆచరించలని, కోరాం, రాష్ట్ర ప్రభుత్వ0 ఉద్యోగల నోటిఫికేషన్లు జారీ చేస్తుంది కానీ ఉద్యోగులు ఇస్తుందో లేదో అని ప్రశ్నించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ0 నుంచి మా పార్టీ లోనే నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అందరూ ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.