పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డ

Published: Thursday November 11, 2021
మేడిపల్లి, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, దుప్పట్లు, సబ్బులు, నూనెలు, మాస్కులు, గ్లౌజులను స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.