డి సి పి సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సమ్మెతో బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్నారు

Published: Monday September 13, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ గణనాథుని దర్శించుకునే భాగ్యం కల్పించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. రాచకొండ డిసిపి సన్ ప్రీత్ సింగ్ తో పాటు కుటుంబ సభ్యులందరూ, అదేవిధంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర కుటుంబ సభ్యులందరూ బాలాపూర్ గణేష్ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో కమిటీ అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి గణనాథుని లడ్డు, తీర్థప్రసాదాలు ఇచ్చి శాలువాతో సన్మానించారు.