ఎం కె ఆర్ పౌండేషన్ శిక్షణ కు విశేష స్పందన మరో రెండు రోజులపాటు దరఖాస్తుల గడువు పెంపు
Published: Tuesday March 22, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి : ఎం కె ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కు సిద్ధమయ్యా వారికి శిక్షణ ఇవ్వటానికి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన లభిస్తోందని ఇప్పటికే రెండున్నర వేలకు పైగా అభ్యర్థులు ఉచిత శిక్షణ తరగతులు దరఖాస్తులు చేసుకున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పౌండేషన్ కార్యదర్శి రాజు పర్యవేక్షించారు ఈ సందర్భంగా జేర్కొనీ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల ఉచిత శిక్షణ యజ్ఞంతో ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలుకు కొత్త ఊపిరి వచ్చిందన్నారు ఉచిత శిక్షణ శిబిరం అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జేర్కొని రాజు పిలుపునిచ్చారు.
Share this on your social network: