తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ చేసిన మందలపు సాయి బాబు చౌదరి

Published: Thursday June 03, 2021
కూకట్ పల్లి, జూన్ 2, ప్రజాపాలన ప్రతినిధిజూన్ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో ఉద్యమ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కెపిహెచ్బి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందలపు సాయిబాబు చౌదరి, డివిజన్ ఇంచార్జ్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు శ్యామల రాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందలపు సాయి బాబు చౌదరి జండా ఆవిష్కరణ చేసి, జనగణమన గీతం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగధనుల ఫలితమే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం అని.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడని.. అంతేకాకుండా అతి తక్కువ ఈ కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక సముచిత స్థానం తీసుకురావడం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే సాధ్యం అయ్యిందని అన్నారు... మంత్రి కేటీఆర్ గారి ముందుచూపుతో.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహాయ సహకారాలతో కేపీహెచ్బీ కాలనీ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిందని... అలాగే ప్రజల మనిషిగా మన్ననలు పొందిన.. కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు గారు డివిజన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అని అన్నారు... అందరం సమిష్టిగా కృషి చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సహాయ సహకారాలతో కెపిహెచ్బి డివిజన్ ను భవిష్యత్తులో మరింత సుందరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ మహానగరంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకువస్తామని అన్నారు... ఈ కార్యక్రమంలో.. వసంత నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వర రావు .. సీనియర్ నాయకులు రాణా ప్రతాప్, నాగిరెడ్డి .. శేఖర్, అమ్మి రాజు తదితరులు పాల్గొన్నారు...