18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా తీసుకోవాలి. కౌన్సిలర్ ఎర్రగుంట్ల లక్ష్మి

Published: Wednesday December 08, 2021
మధిర డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డు ఎర్రగుంట లక్ష్మికౌన్సిలర్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి కోరారు. మంగళవారం వార్డులో కరోనా టీకా నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. కరోనా టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాదన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎర్రగుంట రమేష్ ఏఎన్ఎం పద్మావతి ఆర్పి రత్నకుమారి ఆశ వర్కర్ జ్యోతి పాల్గొన్నారు.