ఇళ్ల స్థలాల పరిశీలనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా
Published: Thursday March 30, 2023
ఎర్రుపాలెం మార్చి 29 బుధవారం ప్రజాపాలన ప్రతినిధి మండలం లోని వివిధ గ్రామాల ఇళ్ల స్థలాల విషయమై పరిశీలనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా ముందుగా మామునూరు గ్రామం కెళ్ళి అక్కడ అన్నపూర్ణమ్మ స్థల వివాదాన్ని పరిష్కరించారు అనంతరం పెగలపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన కొంత ముగ్గుల కోరిని పరిశీలించారు ఆ తదుపరి రేమిడిచర్ల గ్రామ కంఠం భూముల విషయమై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం జమలాపురంలో కూడా ఇళ్ల స్థలాల పరిశీలన చేశారు .వీరి వెంట ఎర్రుపాలెం మండలం తాసిల్దార్, డిపిఓ ,ఆర్ఐ ,తదితర అధికార లు ఉన్నారు.
Share this on your social network: