ఏ. వై .ఆర్ గ్రౌండ్స్ నందు కోచింగ్ అకాడమీ ఆఫ్ పాఠన్స్ ప్రారంభించారు

Published: Wednesday February 24, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ లో  మంగళవారం నాడు కోచింగ్ అకాడమీ అఫ్ పాఠన్స్( సి. ఎ. పి) క్యప్ ను ఏ. వై. ఆర్  గ్రౌండ్స్ నందు ఘనంగా భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్, బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... క్రీడా లలో క్రికెట్ ఆట కు చాలా ప్రత్యేకత ఉంది. అల్మాస్గూడ లో  చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు  కోచింగ్ అకాడమీ ఏర్పర్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, రామిడి మాధురి వీరకర్ణ రెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, సంరెడ్డి వెంకట్ రెడ్డి, ముత్యాల కృష్ణ, జెనిగే ఐలాయ్య, రామిడి సురకర్ణ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రికెట్ అభిమానులు, అకాడమీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.