బోడుప్పల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత : మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Monday November 01, 2021
మేడిపల్లి, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నామని మేయర్ సామల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ న్యూభవాని నగర్లో స్థానిక కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ తో కలిసి మేయర్ బుచ్చిరెడ్డి రూ 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్లో వసతుల కల్పనకు కృషి చేస్తూ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఆసార్ల బీరప్ప, న్యూ భవానినగర్ కాలనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, లెక్చరర్స్ కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాలనీవాసులు పాల్గొన్నారు.