బోడుప్పల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత : మేయర్ సామల బుచ్చిరెడ్డి
Published: Monday November 01, 2021
మేడిపల్లి, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నామని మేయర్ సామల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ న్యూభవాని నగర్లో స్థానిక కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ తో కలిసి మేయర్ బుచ్చిరెడ్డి రూ 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్లో వసతుల కల్పనకు కృషి చేస్తూ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఆసార్ల బీరప్ప, న్యూ భవానినగర్ కాలనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, లెక్చరర్స్ కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Share this on your social network: