నీటిట్యాంకును ఏర్పాటుచేసిన సర్పంచ్ భూక్యా శివ..

Published: Thursday February 03, 2022
ఏన్కూరు, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన న్యూస్): ఏన్కూరు మండలంలోని హిమామ్ నగర్ గ్రామ పంచాయతీలో నూతనంగా నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ నర్సరీలో మొక్కలకు నీటి సదుపాయం కోసం గ్రామ సర్పంచ్ భూక్య శివ ప్రత్యేక వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్యాంక్ ను తన సిబ్బందితో మొక్కలు ఉన్న పైభాగంలో అమర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్కలకు నీటి సౌకర్యం అధికంగా ఉన్నందునా ఈ ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి విజయ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.