*వినాయక మండపం పునర్నిర్మాణం* - జడ్పిటిసి సొంత నిధులతో నిర్మాణ పనులు.

Published: Wednesday March 01, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 28( ప్రజా పాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో వినాయక మండపం పునర్నిర్మాణ నికి చేవెళ్ల జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి తన సొంత నిధులతో పునర్నిర్మాణానికి పూర్తి బాధ్యత వహిస్తూ నిర్మాణ పనులు మంగళవారం అంబేద్కర్ నగర్ కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తాను ఎల్లవేళలా ప్రజలకు సహకరిస్తూ ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రజల పక్షాన ఉంటూ సేవ చేసేందుకు తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఇందుకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ నత్తి కృష్ణారెడ్డి, నాయకులు దండు సత్తి, మర్పల్లి సాయి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మద్దెల జంగయ్య, తలారి యాదయ్య, బురాన్ సత్యానందం మద్దెల  శ్రీనివాస్, యాదయ్య, కరుణాకర్, నరేష్, సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.