శివాజీ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Published: Tuesday July 12, 2022
మేడిపల్లి, జూలై 11 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ సంస్థ పాత కార్యవర్గం 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముగియడంతో ఎన్నికలు సోమవారం నాడు రామంతాపూర్లోని గణేష్ నగర్ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంత రావు సమక్షంలో నిర్వహించారు. శివాజీ యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా వార్ల బాలరాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రాపోలు సాయినాథ్, కోశాధికారిగా జిల్లా శ్రీనివాస్ ఏకగ్రీవంగా నియమితులైనట్లు ఎన్నికల అధికారి కృష్ణారావు తెలిపారు. పూర్తి కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ కుమార్ రెడ్డి, హరీష్, సోమ శ్రీనివాస్, కొత్తపల్లి రమేష్, చెక్క శ్రీనివాస్,కరుణాకర్, యాదగిరి సాగర్, బాలాచారి,గణేష్,జగదీష్, రోషన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: