ఘనంగా శ్రీ గంగా లక్ష్మీ భవాని అమ్మవారి కళ్యాణ మహోత్సవం
Published: Saturday July 23, 2022
మేడిపల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ ఇందిరానగర్ చిన్న చెరువు వద్దగల శ్రీశ్రీశ్రీ గంగా లక్ష్మీ భవాని అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగా లక్ష్మీ భవాని దేవాలయ కమిటీ చైర్మన్ పూస సత్తయ్య ,తెలంగాణ గంగపుత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దీటి మల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు బన్నల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి ,సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: