సర్వసభ్య సమావేశం బహిష్కరణ
Published: Thursday September 16, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది వార్డు మెంబర్ల తీర్మానం లేకుండా గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామ వార్డు మెంబర్లు బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం బహిష్కరించారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు లేఖను పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యి సర్పంచ్ కోర్టు స్టే ఆర్డర్ పై పదవిలో కొనసాగుతూ ఇష్టారాజ్యంగా గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కడవేరు సరోజ, గుర్రాల రాములు, మల్లం హరిప్రసాద్, విజయలక్ష్మి, గనబోయిన కవిత, బూడిద బిక్షమయ్య, ఎడవెల్లి మల్లేశం పరకాల కవిత, బుడిగె కలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: