కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2903365 రూపాయల చెక్కులు పంపిణీ : ఎం.పి.పి కునమల్ల లక్ష్మీ లింగయ్య.

Published: Wednesday October 13, 2021
వెల్గటూర్, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధ్యక్షురాలు కునమల్ల లక్ష్మీ లింగయ్య 20 గ్రామాలకు గాను 29 లబ్ధిదారులకు 2903364 రూపాయల చెక్కులను పంపిణీ మంగళవారం రోజున చేసినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అందుతున్నాయని ఆమె అన్నారు. జెడ్.పి.టి.సి.బి సుధారాణి రామస్వామి, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి రియాజ్, ఏ.ఎం.సీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు గోలి రత్నాకర్, పెద్దూరి భరత్ కుమార్, అధికారులు తహసిల్దార్ ఎం. రాజేందర్, మండల అభివృద్ధి అధికారి సంజీవరావు, డిప్యూటీ తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్.ఐ స్వామి, ఎం.పి.టి.సి.లు సర్పంచ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.