రెండో రోజుకు చేరిన కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

Published: Thursday December 16, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో గతంలో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లో కి తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఏ ఐ టి  యు సి ఆధ్వర్యంలో ఆస్పత్రి ముందట చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారంనాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. నిరాహార దీక్షలకు స్థానిక టి.యన్.టి.యు.సి నాయకులు మని రామ్ సింగ్ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులను బే శరత్ గా విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో పోరాటాలను ఉద్ధృతం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. రెండో రోజు నిరాహార దీక్షలకు కాంట్రాక్టు కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఏ ఐ టి సి నాయకుడు చిప్ప నరసయ్య, దాగమ్ మల్లేష్, రత్నమ్ ఐలయ్య, పుల్లూరు మల్లయ్య, డి ఆర్ శ్రీధర్, మరియు టి ఎన్ టీ యు సి నాయకులు మని రామ్ సింగ్, బొల్లు మల్లయ్య, చింతల రమేష్, తదితరులు పాల్గొన్నారు