సీఎం కేసీఆర్ గాంధి ఆసుపత్రి పర్యటన హాస్యాస్పదం...
Published: Friday May 21, 2021
జగిత్యాల, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి భూమి రమణ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులకు ముందస్తు సమాచారం లేకుండ ఆసుపత్రిని సందర్శిస్తే అసలురంగు బయట పడుతుండే అని ముందస్తుగా రోగులను కార్మికులను బయటకు పంపించి పూర్తి భద్రతతో వార్డులు సందర్శించడం విచారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా పూర్తి వైద్యం అందుతే రోగులు ఎందుకు చనిపోతున్నారని బెడ్స్ ఆక్షిజన్ లేక వందలాది మంది ఎందుకు మరణిస్తున్నారని అన్నారు. ఆసుపత్రి సిబ్బందికి వేతనాలు లేక రోగులవెంట వచ్చిన వారికి భోజనం లేక తల్లడిల్లిపోతుంటే 7 సంవత్సరాలకు గాంధీ ఆసుపత్రిని సందర్శించడం విచారంగా ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న విషయాలు బయటకు పొక్కకుండ పక్కప్లాన్ తో సీఎం కేసీఆర్ పర్యటన చేశారని భూమి రమణ కుమార్ ఆరోపించారు.
Share this on your social network: