సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి జేఏసీ నాయకుల డిమాండ్
Published: Friday September 09, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోర్టు తీర్పు అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేసిన సిఫారసు ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను బేశరతుగా పర్మినెంట్ చేయాలని, అపరిశుకృతంగా వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో
హెచ్ఎంఎస్ నాయకులు ఎండీ గౌస్, కేంద్ర కార్యదర్శి కొండ్ర శంకరయ్య, అబ్దుల్ ఖదీర్, ఐ ఎఫ్ టి యు
జిల్లా అధ్యక్షుడు.T.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: