ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31ప్రజాపాలన ప్రతినిధి *లావని భూములకు కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇవ్వ

Published: Wednesday February 01, 2023

సీపీఎం కాఘజ్ ఘాట్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంచాల మండల   ఎమ్మార్వో కి గ్రామం లో ఉన్న లావని భూములకు కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని అన్నారు దాదాపు 50 సంవత్సరాల నుండి పేద ప్రజలు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు గతంలో విరందరికి ప్రభుత్వ రికార్డ్ లలో వీరి పేర్లు పాత పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి ధరణి వచ్చిన తరువాత వీరి పేర్లు ధరణిలో లేవు కొత్త పాసు పుస్తకాలు కూడా రాలేదు దీని వల్ల ప్రభుత్వం నుండి ప్రజలకు రావలిసిన పతకాలు కూడా అందడం లేదు కాబట్టి దర్యాప్తు చేసి త్వరగా కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని అన్నారు
ఈ కార్యక్రమంలో  సీపీఎం మండల కమిటీ సభ్యులు స్వామి కాఘజ్ ఘాట్  సీపీఎం మాజీ కార్యదర్శి యాట వెంకటేష్  డివైఎఫ్ఐ   మండల అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు