అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక

Published: Tuesday June 22, 2021

మంచిర్యాల టౌన్, జూన్21, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణంలో సోమవారం బిజెపి ఆధ్వర్యంలో ఏకలవ్య ఆశ్రమంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్, యోగ గురువు శ్రీనివాస్ రెడ్డి  అధ్వర్యంలో యోగ అసానాల శిక్షణ ఇవ్వండం జరిగింది. అనంతరం ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు యోగ నృత్యాలు చేయడం జరిగింది అనతరం యోగ గురువులకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి వల్లనే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ప్రతి రోజు యోగ చేయడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్య లో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర రావు, రజినిష్ జైన్, వోడ్నాల లక్ష్మీనారాయణ, రామ చారి, కుమార్ యాదవ్, రంగ శ్రీశైలం, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, తుల ఆంజనేయులు, రాచకొండ సత్యనారాయణ, బోయినీ లలిత, బల్ల రమేష్, నాగుల రాజన్న, మామిడి రమేష్, పచ్చ వెంకటేశ్వర్లు, పల్లె రాకేష్,  మరియు పాల్గొన్నారు