రోడ్డు ప్రమాదాలు అరికట్టే విధంగా చూస్తామని ఎంపీడీవో విజయలక్ష్మి

Published: Monday May 30, 2022

ఇబ్రహీంపట్నం మే తేది 29 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని సాగర్ రహదారి మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు అనేక ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో  ఎంపిడిఓ విజయలక్ష్మి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మెట్రో వాటర్ బోర్డు వారి నిర్లక్ష్యం వల్ల తరచూ  సాగర్ రహదారి రోడ్డుపై ఎంతో మంది స్పీడ్ బ్రేకర్లు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారాని ఎంపీడీవో తెలిపారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేసే విధంగా  స్పీడు బ్రేకర్స్ వేసి రోడ్డును పూర్తిగా సరిచేయలని సంబంధిత హెజ్ఎండబ్లుఎస్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మలుపును వెంటనే స్పందించి వచ్చిన ఆర్ అండ్ బి అధికారులతో కలసి ఎంపిడిఓ, ఎంపీపీ, సుకన్య సిఐ లింగయ్య  సందర్శించారు. రెండు,మూడు రోజుల్లో రోడ్డుకు పూర్తి మరమత్తులు చేసి, ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు.