బీఎస్పీ మండల కన్వీనర్ గా నియామక పత్రం అందజేసిన గ్యార మల్లేష్ ఈసీ మెంబర్ చెరుకుర్ రాజు. బహుజన

Published: Thursday July 21, 2022

ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కమిటీ అత్యవసర సమావేశానికి  ముఖ్య అతిథిగా జిల్లా ఈసీ మెంబర్ చెరుకూరి రాజు హాజరయ్యారు. చెరుకూరి రాజు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర పార్టీలు ప్రజలకు విద్యా వైద్యం, ఉపాధి లేకుండా చేస్తూ అడ్డగోలుగా ధరలు పెంచుతూ మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేసి మళ్ళీ బానిసలుగా చేసే కుట్రలను తిప్పికొట్టాలని డా  ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  బహుజనుల బ్రతుకులల్లో వెలుగులు నింపేందుకు తన  ఐపీఎస్ పదవిని సైతం త్యాగం చేసి ఈ తెలంగాణ ప్రజల కోసం  బీఎస్పీ లో చేరారని, వచ్చే ఎలక్షన్స్ లో బిసిలకు 70 టికెట్లిచ్చి అసెంబ్లీ పంపాలని గ్రామ గ్రామాల్లో సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడానికి బహుజన రాజ్యాధకార యాత్ర చేస్తున్నారని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీ, అగ్రవర్ణ పేదలు సైతం BSP  బీఎస్పీ పార్టీలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో..
అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బొళ్ళ గణేష్ ముదిరాజ్  అసెంబ్లీ కోశాధికారి కొండ్రు రఘుపతి , అబ్దుల్లాపూర్ మెట్ మండల కన్వీనర్ బంగారి మైసయ్య తూర్కయంజాల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతరి కుమార్ గారు, కప్పాడు ప్రశాంత్ , జీవన్ , తదితరులు పాల్గొన్నారు.