న్యూస్ 4 రెండు ఫోటోలు పెట్టండి సార్

Published: Wednesday September 07, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి

*ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవాన్ని పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్: ఎమ్మెల్యే మంచిరెడ్డి*

*1369మంది లబ్ధిదారులకు ఆసరా  పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి*

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం గార్డెన్స్ లో 1369 మంది నూతన ఆసరా పింఛనుదారులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎంపిపి సుకన్య, జడ్పీటీసి జంగమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు.
అనంతరం మండలంలోని 28మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ - షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అవ్వాలకు కొడుకై ఆసరా పింఛన్లు, పెండ్లికూతుర్లకు మేనమామై కల్యాణలక్ష్మీ పథకాలతో ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదుకుంటున్నారని, ఒక వైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంది వనపర్తి సర్పంచ్ ఉదయశ్రీ, పెద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.