బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాధ్...
Published: Wednesday October 06, 2021
హైదరాబాద్ (ప్రజాజ్యోతి సిటీ బ్యూరో) : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వెంగళరావు నగర్ లోని స్థానిక కృష్ణకాంత్ పార్క్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో పార్కులో మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడిన తరువాత కొలనులో బతుకమ్మలను జారవిడిచే సందర్భంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని జి హెచ్ ఎం సి అధికారులకు ఆయన సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మూలంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోలేకపోయామని, ఈ యేడు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: