తహాశీల్దార్ శ్రీలతను సన్మానించిన కూచిపూడి వెంకటేశ్వరరావు..

Published: Tuesday January 31, 2023
తల్లాడ, జనవరి 30 (ప్రజా పాలన న్యూస్):
 *ఉత్తమ తహాశీల్దార్ ఎంపికై జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ చేతులమీదుగా అవార్డు అందుకున్న తల్లాడ తహాశీల్దార్ గంటా శ్రీలతను తెదేపా మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరికొండ శ్రీనివాసరాజు, కొమ్మినేని నరసింహారావు, అయినాల నరసింహారావు, టెంటు సురేష్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, మొక్క కృష్ణార్జున్ తదితరులు ఉన్నారు.*