అర్హులందరికీ కరోనా టీకాను పంపిణీ చేయాలి : ఎంపీ రేవంత్ రెడ్డి

Published: Friday June 04, 2021
మేడిపల్లి, జూన్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) : అర్హులందరికీ కరోనా టీకాను వేయాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ సర్కిల్లో సూపర్ స్ప్రెడ్డర్స్ కు కరోనా టీకా పంపిణీ నేపథ్యంలో గురువారం ఎంపీ రేవంత్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రామంతాపూర్ గాంధీనగర్లోని కరోనా టీకా కేంద్రాన్ని పరిశీలించారు. సూపర్ స్ప్రెడ్డర్స్కు టీకాల పంపిణీ గురించి అక్కడి వైద్య అధికారి డా.సౌందర్యలత, ప్రకాష్ను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ టీకా పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి, నాయకులు గడ్డం రవి కుమార్, బోరంపేట కృష్ణ, తవిడబోయిన గిరిబాబు, లూకాస్,శ్రీనివాస్ యాదవ్, రఫీక్, సురేష్, పోలిశెట్టి సుధాకర్, సందీప్ భాస్కర్, సుంకు శేఖర్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, రంగులశేఖర్, నక్క మల్లి తదితరులు పాల్గొన్నారు.