బస్తీ దవాఖాన ను ప్రారంభించిన ఎమ్మేల్యే డా. సంజయ్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్మన్ భ

Published: Saturday August 20, 2022

జగిత్యాల, ఆగస్టు 19 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ ఇస్లాం పూర లో బస్తీ దవాఖాన ను   ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి రవి, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంభించినారు. అనంతరం వార్డుకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 35 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు  ఎమ్మెల్యే అందజేసినారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఆర్డీవో మాధురీ, డిఎంహెచ్ఓ శ్రీధర్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ లు అస్మా అంజూమ్ షకీల్, రజియుద్దీన్ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ మామా, హానీస్ ఖుతేజ, ఎఎంసి వైస్ చైర్మన్ అసిఫ్, సెంట్రల్ ముస్లిం కమిటీ ఛైర్మెన్ బారీ, ఆటో యూనియన్ అధ్యక్షులు హాజీ, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నదీమ్, నాయకులు అమీణుల్ హసన్, జిలాని, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు, మైనార్టీనాయకులు, తదితరులు పాల్గొన్నారు.