మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థులకు సన్మానం

Published: Wednesday November 16, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన: మెడిసిన్ లో సీట్ సాధించిన    రామకృష్ణాపూర్ విద్యార్థులను బాలల దినోత్సవం సందర్భంగా తవక్కల్  పాఠశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.అనంతరం  పాఠశాలలో చదువుకున్న  విద్యార్థుల్లో మెడిసిన్ సీట్  సాధించిన విద్యార్థులను,   ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్  ప్రిన్సిపల్ రామకృష్ణ  శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తవక్కల్ గ్రూప్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షల్లో జిల్లాకు 11 సీట్లు వస్తే అందులో ఒక తవక్కల్  పాఠశాలలో చదువుకున్న  నలుగురికి విద్యార్థులకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉపాధ్యాయులు చెప్పిన విధంగా క్రమశిక్షణతో చదవడం  తో సాధించారని అన్నారు. విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు  తెలియజేశారు.