మొలంగూర్లో బీజేపీ శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ శంకరపట్నం 14 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Wednesday February 15, 2023

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మంగళవారము బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జీ అంతం రాజిరెడ్డి అధ్యక్షతన కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, హాజరై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, కరోనా కష్టకాలం నుండి పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తూ నిరుపేదలకు బాంధవుడు అయ్యాడని అన్నారు.  ప్రజలు టిఆర్ఎస్ పాలన చూసి విసుగెత్తిపోయారని, మార్పు కోసం ఆలోచిస్తున్నారని,  ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్,  సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి, దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, మండల ప్రధాన కార్యదర్శిలు దాసరపు నరేందర్, ఎలుక పెళ్లి సంపత్, మండల ఉపాధ్యక్షులు పెసర అర్జున్, జానపట్ల రాజిరెడ్డి, కార్యదర్శి దాసరి సంపత్,  ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గౌరవేణి శ్రీనివాస్, ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు బిజిలి సారయ్య, మండల్ సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు పొద్దుటూరి భాస్కర్ రెడ్డి, మల్లేశం కాంతారెడ్డి , రాజు, మహేందర్ రెడ్డి, శివ రెడ్డి, మాచర్ల కుమార్, వార్డ్ నెంబర్ మనోచారి, రాయిని వినోద్, అశోక్, శక్తి కేంద్ర ఇన్చార్జిలు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు