విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

Published: Thursday July 21, 2022

మధిర రూరల్  జులై 20 ప్రజా పాలన ప్రతినిధి మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలలో  చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు బుధవారం పివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పారుపల్లి వెంకటేశ్వరరావు  చేతుల మీదగా రాతపుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పారుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థలందరికీ అవసరమైన నోటు పుస్తకాలను అనేక సంవత్సరాలుగా పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి కృష్ణమాచార్యులు విశ్రాంత ఉపాధ్యాయులు కాలం వీరభద్రం పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, కంచపోగు ఆదామ్, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, బానోత్ బావసింగ్, గుంటుపల్లి రమాదేవి, లక్ష్మి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.