ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటా : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Published: Monday May 10, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని గచ్చిబౌలి నవోదయ కాలనీలో సమస్యలపై భాగంగా స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కార్యకర్తలతో పర్యటించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి, కాలనీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... కాలనీవాసులు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన అన్నారు. కాలనీల్లో అవసరమైన చోట సిసి రోడ్లను, వీధిలైట్ల, మంచి నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటూ, డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది స్పందించకుంటే తక్షణమే నాకు ఫోన్ చేయగలరని కంచ గచ్చిబౌలి నవోదయ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కంచ గచ్చిబౌలి నవోదయ కాలనీ సభ్యులు పాల్గొని తమ ఇబ్బందులను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వివరించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి అధికారులతో తక్షణమే మాట్లాడి సమస్యలు పరిష్కరించే దిశగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవోదయ కాలనీ రెసిడెంట్స్ సొసైటీ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: