గోవిందాపురం ఏ గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
Published: Tuesday November 30, 2021
బోనకల్, నవంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామం లో పారిశుద్ధ్య కార్యక్రమం సర్పంచ్ బాగం శ్రీను వాసరావు అదర్వంలో యస్ సి కాలనీ లో స్కూల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది మల్టీ పర్పస్ వర్కర్ దార సురేష్, మరియు బ్రహ్మయ్య, మౌగలాలిలు తొలగించి స్కూల్ ను శుభ్రపరచడం జరిగింది. అనంతరం సర్పంచ్ భాగం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్కూలు పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బంది కి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోసర్పంచ్ బాగం శ్రీను వాసరావు మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు, పంచాయతీ సిబ్బంది దారా సురేష్, బ్రహ్మయ్య, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: