రాపల్లి గ్రామంలో పలువురు సిపిఐ లో చేరిక

Published: Tuesday June 14, 2022

బోనకల్, జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రా పల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సిపిఐ జిల్లా నాయకులు భాగం హేమంతరావు, పోటు ప్రసాద్ సమక్షంలో సోమవారం సిపిఐ పార్టీలో చేరారు. చేరినవారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల నాయకులు ఏనుగు రవికుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం మాజీ సభ్యులు రాధా కృష్ణ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. పార్టీలో చేరిన ఏనుగు రవికుమార్, రాధాకృష్ణ లు మాట్లాడుతూ రా పల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యపోరు పెరగటం వలన గ్రామపంచాయతీ వేదికగా అక్రమాలకు తెరలేపారని, ఏమిటి అని ప్రశ్నిస్తే పార్టీకి వ్యతిరేకులుగా ముద్రవేసి దాడులకు ఉసి గొల్పుతున్నారని వారు ఆరోపించారు. మాతృ సంస్థ లో చేరడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు గాంధీ, తదితరులు పాల్గొన్నారు.