బి ఎస్ పి పట్టణ అధ్యక్షులుగా ఆకునూరి రాజ్ కుమార్
Published: Monday November 28, 2022
బెల్లంపల్లి నవంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ఆకునూరి రాజ్ కుమార్ ను నియమించినట్లు పార్టీ జిల్లా
అధ్యక్షులు కాదాసి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాబోయే రోజుల్లో బి ఎస్ పి పార్టీని బలోపేతం చేయడానికి,బిసి,ఎస్సి,ఎస్టి మైనార్టీలను ఆర్థికంగా,రాజకీయంగా బలోపేతం చేసి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాడమే తమ పార్టీ లక్ష్యం అని తెలిపారు.రాజకీయంగా అనగ తొక్కబడి, వెనుకబడిన వారు బి ఎస్ పి లో చేరాలని రవీందర్ కోరారు.
తనపై నమ్మకంతో అధ్యక్ష పదవి ఇచ్చినందుకుగాను పట్టణంలో పార్టీని బలోపేతం చేసి బిసి,ఎస్సి,ఎస్టి మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టణ అధ్యక్షునిగా నియామకమైన రాజ్ కుమార్ తెలిపారు. అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర , జిల్లా, అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: