అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా ఆవులగడ్డ శ్రీనివాస్ యాదవ్
Published: Saturday December 03, 2022
మేడిపల్లి, డిసెంబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి)
అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా రామంతాపూర్ కు చెందిన ఆవులగడ్డ శ్రీనివాస్ యాదవ్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని గ్రేటర్ అధ్యక్షులు మైల్ కోల్ మహేందర్ యాదవ్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల గడ్డ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవ్ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తూ, సంఘం అప్పజెప్పిన పనులను క్రమశిక్షణతో పనిచేస్తూ, సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. తనపై
నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు సంఘం నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: