బోడుప్పల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి చామకూర మల్లారెడ్డి

Published: Tuesday July 27, 2021
మేడిపల్లి, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో భాగంగా సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర  మల్లారెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కమిషనర్ శ్రీనివాస్, మేనేజర్ సురేష్ రెడ్డి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.