బేడ బుడగజంగాలకు దళితబంధు వర్తింపజేయాలి --పస్తం గంగరాములు

Published: Wednesday November 30, 2022
చౌటుప్పల్ నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని బేడ బుడగజంగాలకు కూడా వర్తింపజేయాలని మునుగోడు నియోజకవర్గ బేడా బుడగజంగాల అధ్యక్షుడు పస్తం గంగరాములు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గంగరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటినిర్మాణం కోసం 3లక్షలు నిధులు కేటాయిస్తున్న పథకంలో బుడగ జంగాలను కూడా ఎంపిక చేయాలని కోరారు.బేడా బుడగ జంగాల సంఘానికి స్థలం,భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.