కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Friday July 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబనికి 10లక్షల చొప్పున ప్రకటించటం చాలా ఆనందంగా ఉన్నదని, ఇలా ప్రకటించడానికి కృషిచేసిన భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పైళ్ల శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీఆర్ యస్ మండల ఎస్సి సెల్ విభాగం అధ్యక్షుడు ఎడవెల్లి శాంతి కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఆయిటిపముల రవి, మండల ఎస్సి సెల్ జనరల్ సెక్రటరీ కశమల్ల శేఖర్, మండల యూత్ విభాగం అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, మాజీ ఎంపీటీసీ ఐటిపముల జ్యోతి సత్యనారాయణ, గుట్ట డెరైక్టర్ పోలేపాక భిక్షపతి, మార్కెట్ డైరక్టర్ పోలేపాక సత్యనారాయణ, నాతల్లగూడం ఎంపీటీసీ నర్సింహ, గ్రంధాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ, మాజీ చైర్మన్ పల్లెర్ల ప్రకాష్, కొండూరు వెంకన్న, నర్సింహ, బొడిగే లింగస్వామి, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.