కోవిడ్ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday May 18, 2021
మేడిపల్లి, మే17 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కోవిడ్ బాధితులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో   మేయర్ జక్క వెంకట్ రెడ్డి వార్డు అఫీసర్లతో సమావేశమై కోవిడ్ సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరుగుతున్నందున డివిజన్లలో జరిపిన జ్వరం సర్వేల రిపోర్ట్ లను వార్డుల వారిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోవిడ్ బాధితులకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు మరియు వారికి కావలసిన ఆహారం, మందులు అందించాలని సూచించారు. కోవిడ్ బారిన పడిన వారు కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్ 9849009963 కి సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో మేనేజర్ జ్యోతి, రెవెన్యూ ఆఫీసర్ అనిల్ కుమార్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.