పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన* పిఎసిఎస్ రాష్ట్ర పోరం ఉపాధ్యక్షుడ

Published: Wednesday October 19, 2022
పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన*
 
పిఎసిఎస్ రాష్ట్ర పోరం  ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగ బండి శ్రీనివాసరావు బృందం
 
 పాలేరు అక్టోబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి
 రాష్ట్రంలో సహకార సంఘం ఎదుర్కొంటున్న సమస్యల గురించి పిఎసిఎస్ రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షుడు డీసీఎంఎస్ డైరెక్టర్ నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొంతమంది చైర్మెన్ ను కలిసి రాష్ట్రంలో సహకార సంఘం అధ్యక్షులు ఎదుర్కొంటున్న సమస్యలపై పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ని సమస్యల పై వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్యలపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే జీవోను విడుదల చేస్తామని వెల్లడించారు.
 ఈ సందర్భంగా పిఎసిఎస్ రాష్ట్ర ఫారం ఉపాధ్యక్షుడు నాగుబండి మాట్లాడుతూ
 సమస్యల పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కి రాష్ట్ర పిఎసిఎస్ చైర్మెన్ లు  తరపున  కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులు డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు,జాయింట్ సెక్రెటరీ అనంతు కాశయ్య,
గౌరవ సలహాదారులు మందడపు సుధాకర్,రాష్ట్ర ఫోరం సభ్యులు పాల్గొన్నారు.