తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కృష్ణమూర్తి సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు

Published: Wednesday September 14, 2022
బోనకల్, సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కొత్తపల్లి కృష్ణమూర్తి పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కొత్తపల్లి కృష్ణమూర్తి 5వ వర్ధంతి వేడుకలను మంగళవారం గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కృష్ణమూర్తి విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, సిపిఐ ఎం సీనియర్ నాయకుడు మాదినేని నారాయణ మండల కమిటీ సభ్యులు ఉమ్మనేని రవి, ఏడు నూతల లక్ష్మణరావు, కోట కాటయ్య, కొత్తపల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి కృష్ణమూర్తి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళాలకు కొరియర్ గా పనిచేసి కీలక పాత్ర నిర్వహించారన్నారు. కృష్ణమూర్తి వివిధ గ్రామాలలో నైజం నవాబు రజాకారుల ఆగడాలను దళాలకు చేరవేస్తూ కీలకపాత్ర నిర్వహించడంతోపాటు దళాలకు క్రమశిక్షణ కలిగిన కొరియర్ గా తన విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆనాడు నైజాం నవాబు రజాకారులు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 9 మందిని బంధించి దళాల సమాచారం చెప్పాలని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఆ 9 మందిలో కృష్ణమూర్తి కూడా ఉన్నారన్నారు. అయితే 9 మందిలో ఏడుగురిని కాల్చి చంపి గోవిందాపురం ఎల్ గ్రామం తీసుకువచ్చి గ్రామంలో గుర్రాలతో మృతదేహాలను ఊరేగిస్తూ ఒకే చితిపై ఏడుగురిని ఖననం చేశారన్నారు. అయితే కొత్తపల్లి కృష్ణమూర్తి ఎర్రగా అందంగా ఉండటంతో పాటు చిన్న వయసు కావటంతో అరేయ్ నువ్వు అందంగా ఉన్నావు వెళ్లిపో అంటూ విడిచి పెట్టారని ఆ విధంగా కృష్ణమూర్తి ప్రాణాలతో బయటపడ్డాడు అన్నారు. ఆ తర్వాత కృష్ణమూర్తి లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఐదేళ్లపాటు నిజాయితీగా క్రమశిక్షణతో పరిపాలన సాగించాడన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో లక్ష్మీపురం, గోవిందాపురం గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశాడన్నారు. కృష్ణమూర్తి మృతి చెంది ఐదేళ్లు గడిచిన తన జ్ఞాపకాలు ఇంకా గ్రామంలో కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పోరాటయోధుడు కృష్ణమూర్తి నీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై జరిగే పోరాటాలలో పాల్గొనాలని కోరారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత సిపిఎం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు, పొన్నం రాంబాబు, నల్లమోతు వాని, కారంగుల చంద్రయ్య, వల్లం కొండ సురేష్, ఏసుపోగు బాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area