మంచినీటి సమస్యలు రాకుండా చూడాలి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Monday May 03, 2021
మేడిపల్లి, మే 2 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతపూర్ డివిజన్లో మంచినీటి సమస్యలు రాకుండా చూడాలని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు వాటర్ అధికారులకు సూచించారు. డివిజన్లోని శాంతినగర్, భరత్ నగర్  కాలనీలలో మంచినీటి సమస్య పైన కాలనీవాసులు పాత పైపులైన్లు ఉండడం వలన నీరు సరిగ్గా రాకపోవడంతో కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు వాటర్ సూపర్ వైజర్ కిషన్, లైన్మెన్ రైమత్ లతో కలిసి మంచినీటి సమస్యపై ఆకాలనీలను సందర్శించి, కొత్త పైప్ లైన్ వేయించడం జరిగింది. ఈ మేరకు కార్పొరేటర్ వాటర్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి మంచినీళ్లు సరిగా వస్తుందా లేదా అని పర్యవేక్షించారు. ప్రతి ఇంటికి సమృద్ధిగా మంచినీళ్లు రావడంతో  కాలనీవాసులు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, పరివేద వెంకటేశ్వరరావు, శైలేందర్, సురేష్ గౌడ్, వాణి తదితరులు పాల్గొన్నారు.