మధిర పట్టణ పరిధిలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Wednesday December 29, 2021
మధిర డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో లడక బజారు 18 వ వార్డు లో తేరాల వెంకట మోహన్ కుమార్ రిటైర్డ్ లైబ్రేరియన్ ఇటీవల మరణించడంతో మారు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం వందనపు శ్రీనివాస రావు తండ్రి లక్ష్మయ్య ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కనుమూరు వెంకటేశ్వరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు శ్రీనివాస్