రామాపురం రామాలయం కు పొంగులేటి రూ. లక్ష విరాళం

Published: Tuesday March 29, 2022
బోనకల్, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామాపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి నిమిత్తం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. లక్షను ఆలయ కమిటీ నిర్వాహక బాధ్యులకు అందజేశారు. గత ఏడాది కార్తీకమాసోత్సవ వేడుకల్లో పొంగులేటి ఆలయ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి ఆనాడు ఇచ్చిన మాట మేరకు ఈ మొత్తాన్ని సోమవారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్ తొండపు వేణు సమక్షంలో అందజేశారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాపల్లి సర్పంచ్ మందడపు తిరుమలరావు, తెరాస నాయకులు ఉమ్మినేని కృష్ణ, తొండపు వాసు, గుడిపూడి రామకృష్ణ. ఆలయ ఛైర్మన్ బంధం అచ్చయ్య, దుగ్గిబోయిన నాగయ్య, మంద హనుమంతరావు, మంద నారాయణ, బంధం ఉప్పలయ్య, మామిళ్ళ రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు రాళ్ళబండి శ్రీనివాస శర్మ, తమ్మారపు బ్రహ్మం, కొరివి సురేష్ తదితరులు పాల్గొన్నారు.