మండలంలో ఘనంగా నిర్వాహించిన కృష్ణాష్టమి వేడుకలు
Published: Saturday August 20, 2022
జన్నారం, ఆగస్టు 19, ప్రజాపాలన: మండలంలో
స్లేట్ హై స్కూల్ జన్నారం "కృష్ణాష్టమి వేడుకలు" ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం స్లేట్ హైస్కూల్ లో నిర్వాహించిన వేడుకలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో కనువిందు చేశారు. పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జోబిన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
Share this on your social network: