కొత్తపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు

Published: Monday April 25, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కోత్తపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు, ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  కుటుంబ సమేతంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని, శివసత్తులు వూగుతూ, పోచమ్మ ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని, తమతో తెచ్చిన గుఢానాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోత్తపల్లి గ్రామంలో వాడవాడకు బోనాల సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, మహిళలు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.