ఆత్మస్థైర్యం తోనే కరోనుజయించగలం : డా.కోట రాంబాబు
Published: Friday June 04, 2021
మధిర, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించిన డా కోట రాంబాబు మధిర మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను ఈరోజు కె వి ఆర్ హాస్పిటల్ అధినేత డా కోట రాంబాబు స సదర్శించారు. ఐసోలేషన్ సెంటర్ నందు ఉన్న కరోనా బాధితులను ఆయన పరీక్షించారు. వారికి ఆక్సిజన్ లెవల్స్, బాడీ టెంపరేచర్ లెవల్స్ పరీక్షించి అందరికీ అంతా బావుంది. ఎవరూ కూడా భయపడవద్దని అన్నారు. అనంతరం వారికి పండ్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లీలావతి గారు, ఎంపిటీసి వెంకటేశ్వరరావు గారు, ఎర్రయ్య గారు, ఆషా వర్కర్స్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: