ఎమ్మెల్యే ని కలిసిన మదర్ డైరీ ఛైర్మెన్
Published: Wednesday October 06, 2021
వలిగొండ, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల నూతనంగా ఎన్నికైన నార్ముల్ మదర్ డైరీ ఛైర్మెన్ గంగుల కృష్ణా రెడ్డి డైరెక్టర్ లతో కలిసి మంగళవారం భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. కృష్ణారెడ్డి ని శాలువాలతో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీధర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, లింగం యాదవ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: